కృష్ణా–మున్నేరు–పాలేరు అడుగంటుతున్నాయ్

జగ్గయ్యపేట స్టూడియో భారత్ పత్రినిధి

Aug 23, 2026 - 10:28
Aug 23, 2026 - 19:49
 0  168
కృష్ణా–మున్నేరు–పాలేరు అడుగంటుతున్నాయ్

కృష్ణా–మున్నేరు–పాలేరు అడుగంటుతున్నాయ్!

నీటి నిల్వలపై నిర్లక్ష్యం ప్రమాదకరం: సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు

జగ్గయ్యపేట:

వానాకాలం అయినప్పటికీ జగ్గయ్యపేట ప్రాంతంలోని ప్రధాన నది కృష్ణాతో పాటు మున్నేరు, పాలేరు వంటి ప్రధాన వాగులు నీటి ప్రవాహం లేక అడుగంటిపోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.ఈ పరిస్థితిపై సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ప్రజలకు పత్రికల ద్వారా అవగాహన కల్పిస్తూ, భవిష్యత్‌ లో ఎదురయ్యే నీటి సంక్షోభాన్ని ఇప్పటి నుంచే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షం కురిసినంత మాత్రాన నీటి సమస్య తీరదు”

ఈ సందర్భంగా మెటికల శ్రీనివాసరావు మాట్లాడుతూ…

“వర్షం పడుతోంది..కానీ ఆ వర్షపు నీటిని ఎంత మేరకు నిల్వ చేసుకుంటున్నా మన్నదే అసలు ప్రశ్న.నదులు,వాగులు,చెరువుల్లో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితులు లేకపోతే వర్షపు నీరు వృథాగా వెళ్లిపోతుంది.తర్వాత ఎండాకాలంలో తాగునీటి కోసం,సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది” అని ప్రజలకు వివరిస్తున్నారు.

ఇసుక తవ్వకాలపై అప్రమత్తత అవసరం

కృష్ణా,మున్నేరు,పాలేరు పరివాహక ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని ఆయన కోరుతున్నారు.

“నదులు,వాగులు కేవలం ఇసుక కోసం మాత్రమే కాదు.అవి భూగర్భ జలాల సహజ రీచార్జ్ వ్యవస్థలో కీలక భాగం.సహజ వనరులను విచక్షణ లేకుండా దెబ్బతీస్తే దాని ప్రభావం చివరకు మన బావులు, బోర్లపైనే పడుతుంది” అని ఆయన హెచ్చరిస్తున్నారు.

చెరువుల్లో నీరు… చేపల వేటకు మాత్రమే కాదు

చెరువులు,కుంటల్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించి చేపలు పట్టే విధానంపైనా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మెటికల శ్రీనివాసరావు సూచిస్తున్నారు.

“చెరువు నీరు కేవలం చేపల కోసం కాదు.అది పశువులకు, పక్షులకు, పరిసర ప్రాంత ప్రజలకు,భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడే సహజ వనరు.చెరువులను కొంత నీటిని ఖాళీ చేస్తే రేపటి నీటి అవసరాలను ఎలా తీర్చగలం?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

బావులు, బోర్లలో పడిపోతున్న నీటి మట్టాలపై ఆందోళన

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బావులు,బోర్లలో నీటి మట్టం తగ్గుతోందని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన చెబుతున్నారు.ఈ పరిస్థితిని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రాంతీయ నీటి సంక్షోభానికి ముందస్తు హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా

నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మెటికల శ్రీనివాసరావు కోరుతున్నారు.చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, వర్షపు నీటి నిల్వ,చెక్‌ డ్యామ్‌లు,భూగర్భ జలాల రీచార్జ్, నదులు–వాగుల పరిరక్షణ వంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ఆయన సూచిస్తున్నారు.

“నీటి సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కోసం పరుగులు పెట్టడం కంటే… నీటి కొరత రాకముందే జాగ్రత్త పడటం మంచిది” అని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.కృష్ణా,మున్నేరు,పాలేరు మన ప్రాంతానికి ప్రకృతి ఇచ్చిన జీవనాధారాలు.చెరువులు, కుంటలు మన భవిష్యత్ నీటి బ్యాంకులు.వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

“ఈరోజు ఒక చుక్క నీటిని కాపాడితే… రేపు ఒక కుటుంబం దాహాన్ని తీర్చవచ్చు.

ఈరోజు ఒక చెరువును కాపాడితే… రేపు ఒక గ్రామం నీటి కొరత నుంచి బయటపడవచ్చు.”

నీటిని కాపాడుకుందాం… జగ్గయ్యపేట భవిష్యత్ తరాలకు జలభద్రత కల్పిద్దాం!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin top avernace of telugu news