అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్ సర్కార్
తమిళనాడు స్టూడియో భారత్ ప్రతినిధి

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్ సర్కార్
తమిళనాడు:
తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అవయవ దాత లకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్య క్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
అవయవ దానం విష యంలో తమిళనాడు దేశం లోనే అగ్రగామిగా ఉంది.విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవ యవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది.
మరణానంతర అవయవ దానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధు మిత్రులకు తెలియజేయాలి.మిగిలిన వాళ్లు కూడా అవ యవ దానం చేసేలా ప్రోత్సహించాలి.
అవయవ దాతలు,వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని స్టాలిన్ పేర్కొన్నారు..
What's Your Reaction?






