జగ్గయ్యపేట పట్టణంలో పెరుగుతున్న అక్రమ లే అవుట్లు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 15, 2025 - 08:01
Jun 15, 2025 - 11:32
 0  281
జగ్గయ్యపేట పట్టణంలో పెరుగుతున్న అక్రమ లే అవుట్లు

జగ్గయ్యపేట పట్టణంలో తగ్గుతున్న వ్యవసాయ భూమి...

పెరుగుతున్న అక్రమ లే అవుట్ వెంచర్లు

సుమారు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం గండి 

ఇటు వసతుల ఏర్పాటుతో ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం 

జగ్గయ్యపేట 

సుమారు పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంతో జగ్గయ్యపేట పట్టణ మున్సిపాలిటీ విస్తరించి ఉంది.31 వార్డులుగా సుమారు 18,000 నివాస ఇండ్లతో 65,000 జనాభాతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది.మున్సిపాలిటీ కాకముందే జనాభా సుమారు 20,000 లోపు జనాభా ఉన్నప్పుడే జగ్గయ్యపేట పట్టణం విశాలమైన సుమారు 100 అడుగుల రోడ్లతో, సుమారు 30 అడుగుల వీదులతో అభివృద్ధి చెంది ఉందని పలువురు తెలియజేస్తున్నారు.జనాభా పెరుగుతూ మున్సిపాలిటీ గా మారి జగ్గయ్యపేట పట్టణం విస్తరిస్తూ అభివృద్ధి చెందుతుంటే వెంచర్ల ఏర్పాటులో మున్సిపాలిటీ నిభందనలను తుంగలో తొక్కారనే చెప్పుకోవచ్చు.దీనికి కారణం ఇప్పటి వరకు ఏర్పడిన లోకల్ బడీలు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.ఎందుకంటే పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ప్రధానమైన రోడ్లు ఇరుకుగా మారడం,వీధుల రోడ్లు కుంచించుకునే పోతూ,పార్కింగ్ లేకపోవడమే ప్రధాన కారణం.అప్పటికే సుమారు రెండు వేల ఎకరాల పైబడి విస్తరిస్తూ ఉంది.

ఏ ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ లో విశాలమైన సుమారు 12 వేల ఎకరాల విస్తీర్ణంలో అనుమతులతో అరకొర వెంచర్లే ఏర్పాట్లే తప్ప,మేజర్ గా వెంచర్ల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలను ఇప్పటి వరకు మున్సిపాలిటీ అధికారులు తుంగలో తొక్కడంతో అక్రమ లే అవుట్ లను ప్రజలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్న రేట్లతో అక్రమ వెంచర్ల అమ్మకం దారులు అంటకడుతున్నారనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.సుమారు 800 ఎకరాలలో దేవాలయ ఇనామ్ భూములలో కొంతమంది ఇప్పటికే కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకొన్ని నివాసిస్తున్నారు.జగ్గయ్యపేట మండలం తహశీల్దార్ కార్యాలయం నుండి సమాచార హక్కు చట్ట ప్రకారం సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు తీసుకున్న వివరాల మేరకు జగ్గయ్యపేట పట్టణంలో గల సుమారు 9000 వేల ఎకరాలలో వ్యవసాయ భూమి ని సుమారు 80 మంది రైతులు వారు 200 ఎకరాల లోపు విస్తీర్ణం మాత్రమే ఇంటి నిర్మాణం కోసం కన్వర్షన్ చేసుకున్నారనే సమాచారాని ప్రభుత్వ అధికారులు ఇవ్వడం జరిగింది.

అంటే ఇప్పటికే రోజుకో వెంచర్లు వెలుస్తూ సుమారు 2000 ఎకరాల పైబడి వ్యవసాయ భూమిలో వెంచర్లను ఏర్పాటుతో లే అవుట్ మాదిరిగా ప్లాట్లను ఏర్పాటు చేసి అక్రమ లే అవుట్ లను అమ్ముతూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న ఆధారాలు మున్సిపల్ అధికారులకు కనబడకపోవడం శోచనీయం.జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు అక్రమ లే అవుట్ అనుమతుల వల్ల సుమారు 60 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల మేర మున్సిపాలిటీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం సైతం ఆవిరై,కొంతమంది పెద్దల జోబులలోకి పోయిందనే వాదనలు ప్రజలు నుండి వినిపిస్తున్నాయి.దీనితో అక్రమ లే అవుట్ లో ప్రజా అవసరం కోసం జగ్గయ్యపేట మున్సిపాలిటీ కోట్ల రూపాయల ప్రజాధనంతో రోడ్లు,డ్రైన్లు,ఎలక్ట్రికల్ పోల్స్ లను పాలక మండలి మెజారిటీ ఆమోదంతో వేయడం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.అటు ప్రభుత్వ ఖజానా ఆదాయం కోల్పోవడమే కాకుండా ఇటు అక్రమ లే అవుట్ లో వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడం ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం ఇదెక్కడి న్యాయం అన్ని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వ పాలక పెద్దలు అక్రమ లే అవుట్ లపై విచారణ చేపట్టి ప్రభుత్వ ఖజానా ఆదాయానికి గండిపడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు ప్రభుత్వాని కోరుతున్నారు.ప్రభుత్వం జగ్గయ్యపేట మున్సిపాలిటీ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో ప్రజలు వేచి చూడాల్సి ఉంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow