జగ్గయ్యపేటలో ఘనంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

జగ్గయ్యపేటలో ఘనంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ
జగ్గయ్యపేట
కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) నివాసం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి పెట్టిన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ & ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్,శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య ,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు లు పాల్గొన్నారు.సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించి ఇదే రోజున శాసనసభ్యులుగా శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ప్రమాణం స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ,కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళా మణులకు కానుకగా నేటి నుంచి తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామని,చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం ఇవ్వనున్నారు.రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు,ఇంటర్ ఫస్టియర్లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం ఇవ్వనున్నారు.సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు,అన్నా క్యాంటీన్,మెగా డీఎస్సీ,దీపం-2 పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం,తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది.విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో చేసిన వివిధ అభివృద్ధి పనులు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సిసి రోడ్లు మరియు డ్రైన్లు రూ.20.00 కోట్లు,డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు అర్బన్ - రూరల్ రూ.21.00 కోట్లు,నాబార్డు నిధుల నుండి నియోజకవర్గ పరిధిలోని వివిధ రహదారులు అభివృద్ధి రూ.2.60 కోట్లు,రహదారులు - భవనముల శాఖ ద్వారా టెంపరరీ రెస్టోరేషన్, అర్జెంటు రిపేర్లు, ఇంటెన్సివ్ పాచ్ వర్క్,రిటైనింగ్ వాల్స్ & కాజ్ వేస్ రూ.07.83 కోట్లు,దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా దేవాలయాల అభివృద్ధి రూ.01.50 కోట్లు,ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం 525 మందికి రీయింబర్స్మెంట్ మరియు 100 మందికి ఎల్ఓసిలు మంజూరు రూ.5.20 కోట్లు,సాగునీటి సరఫరా శాఖ ద్వారా ఆపరేషన్ & మెయింటినెన్స్ , ఫ్లడ్ డ్యామేజీ రిపేర్లు,చెరువుల అభివృద్ధి నిమిత్తం నిధుల మంజూరు రూ.11.75 కోట్లు,జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 194 గోకులం షెడ్లు మంజూరు రూ.03.88 కోట్లు,రైతులకు సబ్సిడీపై డ్రోన్లు మరియు వ్యవసాయ పనిముట్లు మంజూరు రూ.00.76 కోట్లు మొత్తంగా మంజూరు కాబడిన నిధులు రూ.74.52 కోట్లని వారు అన్నారు.రూ.3,000/- లుగా ఉన్న వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ పింఛన్లు 4,000/- కు పెంచడమయినది.రూ.4,000/- లుగా ఉన్న వికలాంగుల పింఛను రూ.6,000/- లకు పెంచడమైనది.దీపం పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు రూ 5/- లకే అల్పాహారం మరియు భోజనాన్ని,తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలోని పిల్లలకు సంవత్సరానికి 15000 చొప్పున ప్రోత్సాహకం లాంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మన రాష్ట్రం,నియోజకవర్గం ముందుకు దూసుకెళ్తుందని అన్నారు.
రానున్న నాలుగేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నెట్టెం శివరామ్,శ్రీరాం చిన్నబాబు,నూకల కుమార్ రాజా,మేక వెంకటేశ్వర్లు,మైనేని రాధాకృష్ణ, కట్ట వెంకట నరసింహారావు,వైవిఎస్ రెడ్డి మరియు పట్టణ కౌన్సిలర్స్ వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
What's Your Reaction?






