తడిచిన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నందిగామ స్టూడియో భారత్ ప్రతినిధి

తడిచిన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎ.డి ఐ.కె.శ్రీనివాస్
నందిగామ
ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ డివిజన్లోని ప్రధాన పంటలు అయిన వరి,ప్రత్తి మరియు మొక్కజొన్న లకు ఈ వారం కురిసిన అధిక వర్షాలకు పల్లపు ప్రాంతములు ముంపుకు గురికావడం జరిగినది.
ప్రస్తుతం వరి పంట వివిధ దశలలో ఉంది.ముఖ్యంగా నారు మడి మరియు మొలక దశలలో వుంది.అలాగే ప్రత్తి పంట 15-30 రోజుల దశలో ఉన్నది.మరియు మొక్కజొన్న పంట మొక్కఎదిగే దశలో ఉన్నది.ఈ సందర్భంగా నందిగామ సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఐ.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సోదరులందరికీ ఈ క్రింది తెలిపిన సూచనలు/ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందిగా కోరారు.
వరి
నారుమడులు లేదా వెదజల్లిన పొలాలు మూడు రోజులు కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం దెబ్బ తింటుంది.కాబట్టి వెంటనే నీటిని బయటికి తీయాలి.ఐదు రోజులు కన్నా ఎక్కువ నీట మునిగితే నీటిని బయటకు తీసివేసి ఐదు సెంట్లు నారుమడికి ఒక కిలో యూరియా మరియు మ్యూరిఎట్ ఆఫ్ పొటాష్ ను బూస్టర్ డోస్ గా వేసుకోవాలి.మొక్కలు కుళ్ళిపోకుండా ఉండడానికి వీటికి ఒక గ్రాము కార్బెండిజం మందును కలిపి నారుమడిపై పిచికారి చేసుకోవాలి.
ప్రత్తి
జూన్-జూలై నెలలో విత్తిన ప్రత్తి పంట కూడా గత వారం రోజులుగా కురిసిన వర్షాలకి వల్లపు ప్రాంతాలలో ముంపుకు గురి కావడం జరిగినది. ప్రస్తుతం పైరు 30 రోజులలోపు ఉంది.కనుక తక్షణమే అధికముగా ఉన్ననీరును బయటకు తీసి వేయాలి.
నేల ఆరిన తరువాత
అంతర కృషి చేసి లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మొక్కల దగ్గర నేలకు అందిచడం వలన వేర్లు కుళ్ళిపోకుండా ప్రత్తి మొక్క ఎండిపోకుండా కాపాడుకోవచ్చు.పంటపై లీటర్కు పది గ్రాములు 19:19:19 ఎరువును వారం వ్యవధి లో రెండు సార్లు పిచికారి చేయడం వలన త్వరిత గతిన పోషకాలు మొక్కకు అంది నీటి ముంపుకు గురి అయిన ప్రత్తి పైరు త్వరగా కోలుకుంటుంది.
మొక్కజొన్న :
మొక్కజొన్న పంట ఐదు రోజులు కన్నా ఎక్కువ నీట మునిగితే నీటిని బయటకు తీసివేసి పైరును ఆరబెట్టాలి.
What's Your Reaction?






