చంద్రబాబు నాయుడు బయటపడే మార్గాలు అవేనా..

స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 25, 2023 - 23:23
 0  272
చంద్రబాబు నాయుడు బయటపడే మార్గాలు అవేనా..

చంద్రబాబు నాయుడు బయటపడే మార్గాలు అవేనా..

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం సిబిఐ కేసులో చంద్ర బాబు అరెస్టయ్యారు.పదిహేను రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గానే ఉన్నారు.అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ ని ఏసీబీ కోర్టు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఆందోళనతో ఉన్నారు.అసలు చంద్రబాబు నాయుడును ఎవ్వరు టచ్ చేయలేరని భావించారు.అరెస్టు చేసినా గంటలు వ్యవధిలోనే బయటకు వస్తారని కొందరు అనుకున్నారు.రిమాండ్ కు తరలించినా ఒకటి రెండు రోజుల్లో బయట పడతారని అందరు భావించారు.కానీ గంటలు కాస్త రోజులుగా మారాయి..రోజులు కాస్త వారాలయ్యాయి.అయినా సరే కను చూపు మేరలో చంద్రబాబుకు రిమాండ్ నుంచి విముక్తి లభించే పరిస్థితి కనిపించడం లేదని పలువురు తెలియజేస్తున్నారు.దీనితో సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పైనే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు ,శ్రేణులు, అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.అక్కడ చుక్కెదురు అయితే పరిస్థితి ఏంటన్న దానిపై మాత్రం అంతు పట్టడం లేదు.

కోట్ల రూపాయల ఖరీదైన లాయర్లను పెట్టామని,బెయిల్ అవసరం ఎందుకని,అలా చేస్తే వైసిపికి మనమే ప్రచార అస్త్రం ఇచ్చినట్టు అవుతుందని తెలుగుదేశం నాయకత్వం భావించింది.చంద్రబాబు బెయిల్ కు దరఖాస్తు చేయరని. ఏకంగా తనపై కేసును కొట్టించుకునే డైరెక్టుగా బయటకు వస్తారన్నట్టు ఆ పార్టీ చెప్పుకొచ్చారు.అయితే మొదటి నుంచి చంద్రబాబు లాయర్లు ఈ కేసులో టెక్నికల్ అంశాలనే నమ్ముకున్నారు.చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదని,ఆయన అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అనే అంశాల చుట్టూనే చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు కొనసాగాయి.దీనిమూలంగా ఏసీబీ కోర్టు తో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సైతం వారికి ఎదురు దెబ్బ తగిలింది.

అసలు ఆధారాలే లేవని చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదించడం చాలా తప్పని పలువురు అనుకుంటున్నారు.ఈ కేసుకు మూలమే ఈడినని,ఇప్పటికే ఈడి కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా పూర్తి చేసింది.ఈడి పూర్వ పరాలతోనే సిఐడి ఈ కేసులో పట్టు బిగించి,చంద్రబాబును అరెస్టు చేయగలిగింది.ఆ కారణంతోనే ఏకంగా 15 రోజులు పాటు రిమాండ్ విధించగలిగింది.ఇటువంటి తరుణంలో చంద్రబాబు న్యాయవాదులు వ్యూహం మార్చాలి. అసలు స్కామే జరగలేదని,అవినీతికి తావు లేదని,371 కోట్ల రూపాయల నగదు పక్కదారి పట్టలేదనే వాదనలు వినిపిస్తే సుప్రీం కోర్టులో సేమ్ ఇదే సీన్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు న్యాయకోవిదులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులల్లో చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా బయటపడాలంటే ఉన్నది రెండే రెండు ఆప్షన్స్ లని పలువురు మేధావులు అంటున్నారు.కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని బలంగా వాదనలు వినిపించడం,రెండు ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలను విన్నవించడం చేస్తేనే సానుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.అసలు అవినీతే లేదని, 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదిస్తే మాత్రం పాత తీర్పు రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు.

2018 సంవత్సరంలో 17 ఏ అనేది అమల్లోకి వచ్చింది.అంతకంటే ముందుగానే ఈ స్కాం జరిగినట్లు సిఐడి బలమైన ఆధారాలను చూపిస్తుంది.దీంతో 17 ఏ వర్తించదని,గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సిఐడి తరపు న్యాయవాదులు బలంగా వాదించే అవకాశాలు ఉన్నాయి.అందుకే చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ కంటే,ఆయన వయసును సాకుగా చూపించి బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయి.లేకుంటే మాత్రం సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయాని వ్యక్తపరుస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow