భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్పూ
బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు వీరే డిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం..
బండి సంజయ్,సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా పురందేశ్వరీ
ఎన్నికల వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది.తెలుగు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్, సోము వీర్రాజులను తొలగించింది.ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది.
ఇది కూడా చదవండి.....https://studiobharat.com/SEB-caught-the-illegal-liquor-transport-vehicle
అలాగే..బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని సైతం తీసుకుంది.కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం..పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు.అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్, జార్ఖండ్ బీజేపీ చీఫ్గా బాబూలాల్ మారాండి పేర్లను ప్రకటించారు.
What's Your Reaction?






