అక్రమ మద్యం తరలింపు వాహనం పట్టుకున్న యస్.ఈ.బి
గరికపాడు స్టూడియో భారత్ ప్రతినిధి

అక్రమ మద్యం తరలింపు వాహనం పట్టుకున్న యస్.ఈ.బి
గరికపాడు
జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి అక్రమ మద్యం రవాణాని నివారించడంలో భాగంగా 18 మ్యాంసన్ హౌస్ ఫుల్ బాటిల్స్ లను ఏపి 39 కెడి 1804 మారుతి వ్యాగినార్ వాహనం నుండి అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు.ఈ వాహనం నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందినట్లు సమాచారం.పట్టుబడిన వాహనాన్ని జగ్గయ్యపేట పట్టణంలో గల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ కి తరలించడం జరిగింది.
ఇది కూడా చదవండి... https://studiobharat.com/Face-looking-BP-Sugar-Checkup
వాహనంలో దొరికిన 18 మ్యాంసన్ హౌస్ ఫుల్ బాటిల్స్ ను,వాహనాన్ని మరియు అక్రమ తరలింపు కి కారుకుడైన వాహనదారుని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది.చెక్ పోస్ట్ వద్ద సరిపడ సిబ్బంది లేకపోవడంతో అక్రమ మద్యం తరలింపుదారులు తెలంగాణ మద్యాని దొడ్డి దారిన తరలిస్తూ యద్దేచ్చగ రెట్టింపు రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమంగా తెలంగాణ నుండి మద్యం తరలింపు వెనుక ఎవరి హస్తం ఉందోనని ప్రజలు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.
What's Your Reaction?






