మొండి జగ మొండి మధ్య నలుగుతున్న అంగన్ వాడీ లబ్దిదారులు...
స్పెషల్ స్టూడియో భారత్ ప్రతినిధి

మొండి జగ మొండి మధ్య నలుగుతున్న అంగన్ వాడీ లబ్దిదారులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ గత ఇరవై రోజుల నుండి విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల కోర్కెలన్నింటిలో మేజర్ గా ఆమోదించామని ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తున్నారు.కాని మా యొక్క ప్రధాన కోర్కె అయిన జీతం పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత లేదని అంగన్వాడీలు భీష్మించుకొని ఆందోళనలను వృద్దుతం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతుందేమిటి....
రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటినుండి నేటి వరకు 4500 రూపాయల జీతాని అదనంగా పెంచడం జరిగిందని,మిగిలిన వాటిలో చాలా వరకు సమస్యలను ఒప్పుకోవడం జరిగిందని,వెంటనే సమ్మే విరమించి విధుల్లోకి హాజరు కావాలని ప్రభుత్వ పెద్దలు తెలియజేసారు.
అంగన్వాడీ లు ఇది అవాస్తవం అని ఎందుకు అంటున్నారు...
రాష్ట్ర మొత్తం మీద అంగన్వాడీలు ప్రభుత్వం చెప్పుతుంది అవాస్తవం అంటున్నారు.వైకాపా ప్రభుత్వం తెలంగాణ అంగన్వాడీల కంటే అదనంగా వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పినట్లు వారంటున్నారు.
తెలంగాణలో అంగన్వాడీలకు 13500 రూ లు జీతం ఉండగా రేవంత్ రెడ్డి సియం అవ్వగానే వారికి జీతాలను మరల పెంచడం జరిగిందని వారు తెలియజేస్తున్నారు.
కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గతంలో 10500 రూపాయల నుండి 1000 రూ. లు మాత్రమే పెంచి 11500 రూ లుగా అంగన్వాడీలకు జీతాలను ఇస్తూ,వివిధ యాప్ లను పెంచి పనిభారం పెంచిందని వారు ఆరోపిస్తున్నారు.జీతాల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పై కనికరించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవ విశ్లేషణ:-
అటు జీతాలను పెంచందే విధుల్లోకి వెళ్ళే పరిస్థితి లేదని అంగన్వాడీలు పోరాటాని వృద్దుతం చేస్తూ భీష్మీంచుకున్నారు.మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర పరిస్థితి బాగాలేదని మొండిగా వ్యవహరిస్తూ ఏదో ఉద్దరిస్తామన్నట్లుగా అంగన్వాడీ కేంద్రాలను సైతం తాళాలను పగలగొట్టడం జరిగింది.అంగన్వాడీలను విధులలోకి వెళ్ళాలని ప్రభుత్వ పెద్దలు ఇటు తెలియజేస్తున్నారు.కాని ససేమిరా అంటూ అంగన్వాడీల సమ్మెను ఉధృతం చేసారు.
అటు మొండిగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఇటు వారేమైన చేసుకొని మాకేమిటి అన్న ధీమాతో ఉన్న జగ మొండి అయిన రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాష్ట్రం మొత్తంగా సుమారు 20 లక్షల మంది పౌష్టికాహార లోపం ఉన్న పేద లబ్దిదారులు మాత్రం పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజ్ గా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి మున్సిపల్ కమీషనర్స్,యంపిడిఓ లను నోడల్ ఆఫీసర్లు గాను సచివాలయ సిబ్బంది ని కేటాయించి వారికి వారి అదనంగా పని భారం పెంచడంతో రెండు డ్యూటీలు చేయలేక అవస్థలు పడుతున్నారు.దీనితో మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంతో పేద లబ్దిదారులకు మధ్యాహ్నం పూట అందాల్సిన పౌష్టికాహారం అందక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలి...
మొండిగా వారి సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు,జగమొండిగా జీతం పెంచేదే లేదని భీష్మించుకున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల సామాన్య ప్రజలు వీరు తీరు పట్ల విసుగు చెందుతున్నారు.
ఇటువంటి సరైంది కాదని ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ కు బడ్జెట్ తగ్గిస్తుందని వెంటనే అంగన్వాడీల ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని మరియు వారి జీతాల విషయంలో తెలంగాణ ప్రభుత్వాని దృష్టి లో పెట్టుకొని మహిళలైన అంగన్వాడీల జీతాలను పెంచి వెంటనే సమ్మెను విరమింప చేయాలని మేధావులు తెలియజేస్తున్నారు.మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?






