కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ విషయంలో తెలిపిన బిగ్ అప్డేట్స్
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి

కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ విషయంలో తెలిపిన బిగ్ అప్డేట్స్
క్రికెట్ ప్రపంచ కప్ వన్డేలో మెగా ఫైట్ కు అంతా రెడీ అయింది.చిరకాల ప్రత్యర్థులు దాయాదులైన భారత్,పాకిస్థాన్ మధ్య ది:24/10/23 మ్యాచ్ జరగనుంది.
భారత్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ డెంగ్యూతో బాధ పడుతుండగా,ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు.దీంతో గిల్ పాకిస్థాన్ తతో పోరుకు సిద్ధమవుతాడా లేదా అని తీవ్రమైన ఉత్కంఠ భరితంగా ఉంది.జటులో ఫుల్ ఫామ్ లో గిల్ ఉన్న టీమ్ ఇండియాకు పెద్ద ప్లస్ అవుతుంది.ఈ తరుణంలో 13 అక్టోబర్ న మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
శుభ్ మన్ గిల్ 99శాతం పాకిస్థాన్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని రోహిత్ శర్మ చెప్పాడు.అంటే దాదాపు గిల్ ఆడడం ఖాయమని కెప్టెన్ రోహిత్ చెప్పేశాడు.ఇప్పటికే డెంగ్యూ నుంచి దాదాపు పూర్తిగా గిల్ కోలుకున్నారు.గురువారం నెట్ లో సాధారణంగా ప్రాక్టీస్ చేశాడు.
ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లు ఏ పిచ్ పై అయినా పరిస్థితులకు తగ్గట్టు మెరుగ్గా ఆడగలరని రోహిత్ శర్మ చెప్పాడు. అదే ప్రస్తుత టీమిండియా బెస్ట్ క్వాలిటీ అని హిట్ మ్యాన్ అన్నాడు.
ఈ సంవత్సర కాలంలో శుభ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.ఈ సందర్భంగా 20 వన్డేలలో ఆడి సుమారు 72 సగటు రేటుతో ఏకంగా 1,230 పరుగులు చేశారు.ఈ ఏడాదే ఐదు సెంచరీలు,ఐదు అర్ధ శకతాలతో గిల్ దూకుడు చూపించారు.డబుల్ సెంచరీ కూడా చేశాడని ఆయన తెలిపారు.ఆసియాకప్ లోను సత్తా చాటాడు.గిల్ సరిగ్గా ప్రపంచకప్ కు ముందే డెంగ్యూ బారిన పడ్డాడని,ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ లకు గిల్ దూరం అయ్యాడు.అయితే,పాకిస్థాన్తో మ్యాచ్కు అతడు అందుబాటులోకి రావడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ అదిరే ఆరంభం అందుకుంది.తొలి రెండు మ్యాచ్ ల్లో భారీ ఘన విజయాలు నమోదు చేసుకుంది.ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ పై భారత్ కెప్టెన్ రోహిత్ సేన గెలిచింది.అఫ్గాన్ తో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131) మెరుపు శతకం చేశారు.దీంతో ఏకంగా 35 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.
What's Your Reaction?






