ఇజ్రాయిల్‌ అక్రమ నిర్మాణాలకు చట్టబద్ధత

ఇజ్రాయిల్ స్టూడియో భారత్ ప్రతినిధి

Nov 17, 2023 - 08:10
 0  27
ఇజ్రాయిల్‌ అక్రమ నిర్మాణాలకు చట్టబద్ధత

ఇజ్రాయిల్‌ అక్రమ నిర్మాణాలకు చట్టబద్ధత

ఇజ్రాయిల్ 

2016డిసెంబరు 23 నాడు ఐక్యరాజ్యసమితి 7853వ సమావేశంలో భద్రతామండలి 2334వ తీర్మానాన్ని 1967లో చేసిన ఆరు రోజుల యుద్ధానంతరం పాలస్తీనా భూభాగాలైన జెరూసలేం,వెస్టు బ్యాంకులను ఇజ్రాయిల్‌ ఆక్రమించింది.ఈ ప్రాంతాలకు సుమారు ఆరు లక్షల మంది యూదులు ఇజ్రాయిల్‌ నుంచి తరలి వచ్చారు. అక్కడి పాలస్థీనియన్లను పారద్రోలటమే గాక శాశ్వత నిర్వాసిత కట్టడాలను నిర్మించడం ప్రారంభించారు. 

ఈ నిర్మాణాలను, ఇకపై నిర్మించబోయే కట్టడాలను భద్రతామండలి తన 2334వ తీర్మానంలో గట్టిగా వ్యతిరేకించింది.తీర్మానానికి 14:0 ఓట్లు అనుకూలంగా లభించాయి.అమెరికా మాత్రం తెలివిగా వీటో ఉపయోగించకుండా తటస్థ వైఖరిని చేబట్టింది. ఆ సమయంలో అమెరికాలో ఇంకా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టని ట్రంప్‌ మాత్రం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించి తాను 2017 జనవరి20న పదవీ బాధ్యతలు చేపట్టే వరకూ ఓపికగా ఉండాలని సూచించారు. 

ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలకు దారితీయగా ఇజ్రాయిల్‌ మాత్రం రెచ్చిపోతూ నూతన కట్టడాలను కూడా నిర్మిస్తున్నది.రాజ్యాంగ విరుద్ధ ఇజ్రాయిల్‌ పార్లమెంటు చట్టం ఇప్పటి వరకూ పాలస్తీనా భూభాగంలో నిర్మితమైన నాలుగు వేల నివాస కట్టడాలకు చట్టబద్ధతను కల్పిస్తూ ఫిబ్రవరి 6న ఇజ్రాయిల్‌ పార్లమెంటు తీర్మానించింది.పార్లమెంటు నిర్ణయాన్ని ప్రపంచమంతటా ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్‌ కూడా పార్లమెంటు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

ఇజ్రాయిల్‌లోని అరబ్‌ మైనారిటీ హక్కుల కేంద్రం, జెరూసలేంలోని మానవ హక్కుల సంఘాలు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్‌ సుప్రీంకోర్టులో ఇంజక్షను ఆర్డరు ఇవ్వాలని,తద్వారా పాలస్తీనా ప్రయివేటు భూములను ఇజ్రాయిల్‌ కొనుగోలు చేయకూడదని,రిజిస్ట్రేషన్లు తక్షణమే ఆపాలని కోరుతున్నాయి.ఇజ్రాయిల్‌ అటార్నీ జనరల్‌ అపిబై మాండెల్‌బ్లిట్‌ పార్లమెంటు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ ఆక్రమిత భూభాగంపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడం చట్ట వ్యతిరేకమని,తాను మాత్రం ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించబోనని స్పష్టం చేశారు. 

ఈ చట్టం ఇజ్రాయిల్‌లో రాజ్యాంగం కల్పించిన ప్రయివేటు ఆస్తిహక్కుకు భంగం కల్గిస్తూ దుర్వినియోగపరుస్తుందని, అంతర్జాతీయ న్యాయవ్యవస్థకు అనుగుణంగా ఇజ్రాయిల్‌ ప్రవర్తించడం లేదని అన్నారు.ఈ చట్టం ప్రజాస్వామ్య వ్యతిరేకమని,ఇజ్రాయిల్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఆక్రమిత భూభాగంలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఓటుహక్కు లేదు గనుక ఈ చట్టం వర్తించదని అటార్నీ జనరల్‌ ప్రకటించారు.ఈ చట్టాన్ని తక్షణమే పున:పరిశీలించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోల్లాండే అభిప్రాయపడ్డారు.ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం పార్లమెంటు చట్టంపై మౌనం వహిస్తూ కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే అభిప్రాయం చెబుతామని తప్పించుకొంది.పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇదొక చట్టబద్ధ దురాక్రమణగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ వర్ణించారు. 

మేము పాలస్తీనా,ఇజ్రాయిల్‌ మధ్య శాంతిని కోరుకొంటున్నాము.కానీ ఇజ్రాయిల్‌ మాత్రం జాతి వివక్షతో ఒకే జాతిగా,ఒకే దేశంగా మా పాలస్తీనాను మొత్తంగా కబళించాలని అడుగులు వేస్తున్నది అని అధ్యక్షుడు వాపోయారు.మధ్య ప్రాచ్యంలోని ఐక్యరాజ్యసమితి సంధానకర్త నికొలామ్‌ మ్లాడెనొన్‌ ఈ చట్టం ద్వారా అరబ్‌`ఇజ్రాయిల్‌ శాంతికి భంగం ఏర్పడుతుందని,పార్లమెంటు చేసిన చట్టం ద్వారా అనేక దుష్టయాగాలు చోటు చేసుకొంటాయని హెచ్చరించారు.ఇజ్రాయిల్‌కు ట్రంప్‌ విదేశాంగవిధాన అండ ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా పదవి చేపట్టినప్పటి నుంచి ఆక్రమిత భూభాగంలో ఇజ్రాయిల్‌ నిర్మాణాలు పెరుగుతున్నాయి. 

నిర్మాణాలు చేస్తున్నవారంతా ట్రంప్‌ఎన్నికను ఆహ్వానించినవారే. పైగా ఇజ్రాయిల్‌లో అమెరికా రాయబారిగా డేవిడ్‌ ఫ్రీడ్‌మేన్‌ను ట్రంప్‌ నియమించారు.ఆయన పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్‌ కడుతున్న శాశ్వతకట్టడాలకు అనుకూల వ్యక్తి. గతంలో అనేకసార్లు వీరి కోసమై తాను నిధులు సేకరించారు.ఇతను లోగడ ఇజ్రాయిల్‌ రాజధానిని టెల్‌ అవీవ్‌ నుంచి ఆక్రమిత జెరూసలేంకు మార్చాలని సూచించిన వ్యక్తి కూడా.కండబలం,ధనబలం ఉన్న ఇజ్రాయిల్‌ యూదులు పాలస్తీనా వెస్టుబ్యాంకు ప్రాంతంలోని 97 ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టినట్లు వాచ్‌డాగ్‌`పీస్‌నౌ ఎన్‌జిఒ సంస్థ తెలియజేస్తోంది.అమోనా ప్రాంతంలో నిర్మాణమైన అతిపెద్ద కాలనీని మాత్రం సుప్రీంకోర్టు తీర్పుననుసరించి పదిరోజుల క్రితం పోలీసులు ఖాళీ చేయించారు. 

ప్రస్తుతచట్టంద్వారా 55 ఔట్‌పోస్టుల్లో ఉన్న 72 కాలనీల్లోని ఇళ్ళకుచట్టబద్ధత కలుగుతుందని పీస్‌నౌ సంస్థ తెలియజేస్తున్నది. క్రమేపీ ఈ ఔట్‌పోస్టుల సామర్థాన్నీ, వైశాల్యాన్నీ పెంచి మరింతగా పాలస్తీనా భూ భాగంలోకి ప్రవేశించగలదని,పాలస్తీనా మరింత దౌర్జన్య దురాక్రమణకు గురవుతుందని వాచ్‌డాగ్‌ తెలియజేస్తున్నది. ఓటింగుసమయంలో యుకె పర్యటనలోఉన్న ఇజ్రాయిల్‌ ప్రధాని తనమంత్రి ఒఫర్‌ అకూనీతో ‘యూదుల ప్రాంతమిది,ఈ భూమంతా యూదులకే చెందాలి’ అని చెప్పించటం ద్వారా ఇజ్రాయిల్‌ జాత్యహంకార, దురాక్రమణ ధోరణులు మరొక్కసారి వ్యక్తపరచడం జరిగింది.

అలీనోద్యమం బలహీనపడటంతో పాలస్తీనా ఉద్యమం సంఫీుభావం అంతర్జాతీయంగా వినబడటం లేదు.రికార్డు పర్యటనల కోసం ఇది వరకు భారత ప్రధానులెవ్వరూ పర్యటించని ఇజ్రాయిల్‌కు నరేంద్ర మోడీ ప్రయాణించడానికి ఎపడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నారు.పాలస్తీనియన్లపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన కనబడటం లేదు.

 చిన్నప్పుడు మన స్కూలు పాఠాల్లోని ఒక కథ గుర్తుండే ఉంటుంది. ఎడారిలో చలి నుంచి కాపాడుకొనేందుకు ఒక ఒంటె యజమాని గుడారంలోకి నెమ్మదిగా తలతో ప్రవేశించి, క్రమేపీ గుడారం మొత్తాన్ని ఆక్రమించి యజమానిని బయటి చలిలోకి తరిమేస్తుంది.

పాలస్తీనా విషయంలో సరిగ్గా ఇదేజరగబోతున్నదా అనే సందేహాన్ని నిజం కానివ్వక ఒంటె అనే ఇజ్రాయిల్‌ నుంచి గుడారం లాంటి పాలస్తీనాను కాపాడటానికి మనదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అభ్యుదయవాదులంతా ముందుండి సంఫీుభావం తెల్పాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన గళాన్ని వినిపించేలా ఒత్తిడి చేయాలి. చరిత్ర పాఠాన్ని పునరావృతం కానీయరాదు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow