యస్.యస్.సి బ్యాచ్ స్వర్ణోత్సవ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 9, 2025 - 14:59
Feb 9, 2025 - 20:21
 0  522
యస్.యస్.సి బ్యాచ్ స్వర్ణోత్సవ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం 

యస్.యస్.సి బ్యాచ్ స్వర్ణోత్సవ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణంలో ఉక్కు కళా క్షేత్రంలో 1974-1975 సంవత్సరంలో గెంటేల వెంకటజోగయ్య ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యస్.యస్.యల్.సి(యస్.యస్.సి) చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు యాభై సంవత్సరాలు స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సమేతంగా ఆత్మీయ సమ్మేళనం వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకలలో రెండు తెలుగు రాష్ట్రాలు,ఇతర దేశాలలో నివసిస్తున్న పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.1974-1975 సంవత్సరం లో 130 చదువుకున్నారని,వీరిలో సుమారు 27 మంది మరణించారని స్వర్ణోత్సవ పూర్వ విద్యార్థులు తెలియజేశారు.మిగిలిన వారందరు దేశ,విదేశాలల్లో ఉన్న పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.యస్.యస్.సి పూర్తి చదువును చేసుకొని పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరుకోవడంతో పాత స్మృతులను గుర్తు చేసుకోని ఆప్యాయం గా పలకరించుకున్నారు.సహబంతి విందు చేసారు.అనంతరం సర్ణోత్సవాల గుర్తుగా మెమంటలను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థల దాత గెంటేల వెంకటజోగయ్య గారి ముని మనవడు గెంటేల విద్యాసాగర్,రిటైర్డ్ యంఇఓ వెంకటేశ్వర శర్మ,ప్రస్తుత హెచ్.యం మాధవీ లత, పెనుగంచిప్రోలు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వీరవల్లి దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిలు మాట్లాడుతూ యస్.యస్.సి చదువుకుని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నందుగా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమాని పసుపుల పుల్లారావు,శిరంశెట్టి కాంతారావు,మొరిశెట్టి రంగారావు,వీరవల్లి శ్రీనివాసరావు లు నిర్వహించడానికి పూనుకున్నారు.ఈ కార్యక్రమాని విజయవంతం చేయడానికి మొరిశెట్టి రామనాథం (యు.యస్),శారదా,పాకలపాటి శ్యామలా,పైడిమర్రి రూపవతి తదితరులు అందరు సహకరించారని పూర్వ విద్యార్థులు తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow