అంగన్వాడీ సమ్మె విచ్చినానికి టెర్మినేషన్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది

స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 20, 2024 - 21:01
 0  113
అంగన్వాడీ సమ్మె విచ్చినానికి టెర్మినేషన్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది

అంగన్వాడీ సమ్మె విచ్చినానికి టెర్మినేషన్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 40 రోజు ల పైబడి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల 11 సమస్యలలో 10 సమస్యలను చర్చించి పరిష్కారాలకు మార్గం చూపిందని ప్రభుత్వ పెద్దలు మీడియా సమావేశంలో తెలియజేశారు.కాని ప్రధాన డిమాండ్ అయిన జీతాల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదనే విషయం వాదనలు అంగన్వాడీ యూనియన్ నాయకులు వాదిస్తున్నారు.అంగన్వాడీ సమ్మె మొండి గా సమస్య పరిష్కారం కోసం పోరాడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగ(న్) మొండిగా వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనితో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఎస్మా,షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు,ప్రస్తుతం వారిని టెర్మినేషన్(తొలగించడం) చేయడానికి మరియు వారి స్థానంలో సచివాలయాల నుండి కొత్త వారిని నియమించే ప్రక్రియ నోటిఫికేషన్ ద్వారా చేయాలనే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అంగన్వాడీల నియామకం కోసం అంగన్వాడీల కేంద్రాల నిర్వహణ ఆయా ప్రాంతాలలో రోస్టర్ పద్దతిని సంబంధిత శాఖ అధికారులు ప్రిపరేషన్ చేస్తున్నట్లుగా ఉంది.ఇంత తంతు ప్రక్రియ జరుగుతున్న అంగన్వాడీ నాయకులు మాత్రం సమ్మె పోరాటం విజయవంతం చేసుకుందాం,అందరు ఐక్యంగా ఉండాలని తెలియజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల జీతాల పెంపు పట్ల మొండి వైఖరిగా ఉండటం,పెరుగుతున్న నిత్యావసర ధరల కనుగుణంగా అంగన్వాడీలు మాకు జీతాలు పెంచాల్సిందేనని మంకు పట్టుపటడం తో ఏమి జరుగుతుందోనని ప్రజలు చూస్తున్నారు

.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow