జగజ్జనని పాదాల చెంత మనో రంజకంగా సాగుతున్న కళా వైభవం 

ఇంద్రకీలాద్రి... స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 21, 2023 - 23:33
Oct 21, 2023 - 23:37
 0  97
జగజ్జనని పాదాల చెంత మనో రంజకంగా సాగుతున్న కళా వైభవం 

జగజ్జనని పాదాల చెంత మనో రంజకంగా సాగుతున్న కళా వైభవం 

ఇంద్రకీలాద్రి 

విజయవాడ 

విజయవాడ ఇంద్రకీలాద్రి జగజ్జనని పాదాల చెంత సాంస్కృతిక ప్రదర్శనలు వైభవోపేతంగా శరన్నవరాత్రి వేడుకలు ఒకవైపు,జగజ్జనని దర్శనం కోసం,జగన్మాతను శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శించేందుకు లక్షలాదిగా వస్తున్న భక్తులకు మానసికొల్లాసకాన్ని,ఆధ్యాత్మిక భావ తరంగాలలో విహరింపజేసే కళా ప్రదర్శనలు మరొకవైపు...శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని కనులారా చూడాలని వస్తున్న భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న

కళా ప్రదర్శనలు తిలకించి భక్తులు మైమరచిపోతున్నారు.

Studio bharat

ప్రతిరోజు కళావేదికపై నిత్య నూతనమైన స్వర, నృత్య ప్రదర్శనలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి.నవరాత్రి ఉత్సవాలలో ఏడవ రోజు అయిన శనివారం జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు కొండపైన దర్శనమిచ్చారు.

దర్శన భాగ్యం పొందిన భక్తులకు మరింత భక్తి తరంగాలలో తేలియాడేలా కొండ కింద అపురూప కార్యక్రమాలు జరుగుతున్నాయి.లలితా దేవి జనవృత్తాంత ఆధారంగా యు.గంగాధర్ స్వరం నుంచి పలికిన ప్రవచనాలు,చల్లపల్లికి చెందిన బి.రామాంజనేయులు తాళం భజన,హైదరాబాదుకు చెందిన వై. విజయవల్లి ప్రదర్శించారు.

Studio bharat

పార్వతి కళ్యాణం నృత్యరూపకం,శారద రామకృష్ణ ప్రదర్శించిన ఆంధ్ర నాట్యం అంశాలతో పాటు విశాఖపట్నంకి చెందిన నృత్య కళాకారులు చందన,టి.సందీప్ కుమార్,విజయవాడకు చెందిన సప్ప శివకుమార్,ఎం.సహస్ర,బి.హెచ్. శ్రావణి,హైదరాబాద్ కళాకారులు సిహెచ్ వీరభద్రరావు, అనన్య లు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు వీక్షకులను రంజింప చేశాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow