పాకిస్థాన్ పై ఆసీస్ విజయం సాధించింది
చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. అడ్డుచెప్పిన పోలీస్... ..స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి

62 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై ఆసీస్ విజయం సాధించింది.
చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. అడ్డుచెప్పిన పోలీస్
బెంగళూరు
చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.అందులో ఓ క్రికెట్ ప్రేక్షకుడు పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తించాడు.అతను పాక్ క్రికెట్ అభిమానిగా తెలుస్తోంది.
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడు పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించగా.. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి అతన్ని అడ్డుకున్నారు.దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఉన్న వీడియో వివరాలను బట్టి తనకు తాను పాకిస్తాన్ కు చెందినవాడినని చెప్పుకున్న క్రికెట్ ప్రేక్షకుడు.. పోలీసుతో వారిస్తున్నాడు.భారత్ మాతాకీ జై అన్న నినాదాలు చేయొచ్చుగా,కాని పాకిస్తాన్ జిందాబాద్ అని ఎందుకు అనకూడదో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడు.అందుకు పోలీస్ అధికారి బదులిస్తూ.. భారత్ మాతా కీ జై మంచిదదే కానీ పాకిస్తాన్ జిందాబాద్ మంచిది కాదని చెప్తున్నారు.
ధీటుగా పోరాడి ఓడిన పాక్
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 367 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాక్ పోరాటం చేయాల్సి వచ్చింది.45.3ఓవర్లు పూర్తి అయ్యేసరికే 10 వికెటలను నష్టపోయి 305 పరుగులు చేసింది.ఇందులో పాక్ క్రికెట్ ఆటలో ఇమామ్ ఉల్ హక్(62), అబ్దుల్లా షఫీక్(62) చేయడం జరిగింది.62 పరుగుల తేడాతో పాకిస్థాన్ జట్టు పై ఆసీస్ గెలుపొందింది.
What's Your Reaction?






