హమాస్-ఇజ్రాయిల్ దాడులలో జర్నలిస్టులు మృతి
ఇజ్రాయెల్ స్టూడియో భారత్ ప్రతినిధి

హమాస్-ఇజ్రాయిల్ దాడులలో 22 మంది జర్నలిస్టులు మృతి?
ఇజ్రాయేల్ :
హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడులలో ఇప్పటి వరకు విధినిర్వహణలో ఉన్న 22 మంది జర్నలిస్టులు మృత్యు వాత పడినట్లు తెలిసింది.
అక్టోబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న ఫైటింగ్లో 18 మంది పాలస్తీనియన్లు,ముగ్గురు ఇజ్రాయిలీలు,ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు.సీపీజే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్లు ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇజ్రాయిల్ చేసిన దాడుల వల్లే 15 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు సీపీజే పేర్కొన్నది.ఇక హమాస్ చేసిన దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.8 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. మరో ముగ్గురు ఆచూకీ తెలీయరాలేదు..
ఇది ఇలా ఉంటే ఇద్దరు అమెరికన్లను హమాస్ తీవ్రవాదులు నేడు వదిలివేశారు. మానవతా కోణంలో ఈ ఇద్దరిని విడుడల చేసినట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది..
ఇక అమెరికా ప్రకటించిన సాయం నేపథ్యంలో ఈజిప్ట్ నేడు ఇజ్రాయిల్ తో ఉన్న సరిహద్దును తెరిపింది..దీంతో వందలాది వాహనాలు ఇజ్రాయిల్ లో ప్రవేశించాయి...
What's Your Reaction?






