ఓటియస్ పట్టాలకు బ్యాంకుల రుణాలను ఇప్పించాలని లబ్దిదారులు ఆవేదన
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి

ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఓటియస్ ఇంటి పట్టాలు నిరుపయోగమేనా.....
ఓటియస్ పట్టాలకు బ్యాంకుల రుణాలను ఇప్పించాలని లబ్దిదారులు ఆవేదన
విజయవాడ
ప్రభుత్వ ఇండ్లకు కాలనీ పెండింగ్ అమ్మౌంట్ ను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వ స్థలాలో ఇంటిని నిర్మించుకున్న వారికి శాశ్విత రిజిస్ట్రేషన్ తో ఇంటి పట్టాలను గత ప్రభుత్వం ఒన్ టైం సెటిల్ మెంట్ చేయడం జరిగింది.దీనితో లబ్దిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగదును చెల్లించారు.నగదు చెల్లించిన వారికి నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేసి రిజిస్ట్రేషన్ చేసి ఇంటి పట్టాలను గత ప్రభుత్వం ఓటియస్ క్రింద ఇవ్వడం జరిగింది.ఈ ఓటియస్ పట్టాలను బ్యాంకులో తనాఖా చేసుకోవచ్చని గత ప్రభుత్వం లబ్దిదారులకు తెలియజేసింది.
ప్రజలు ప్రభుత్వ ఖజానాకు నిభందనల ప్రకారం నగదును చెల్లించి ఓటియస్ క్రింద రిజిస్ట్రేషన్ కాబడిన పట్టాలకు బ్యాంకుల వారు రుణాలను ఇవ్వడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పట్టాలు కలిగిన వారు బ్యాంకు తాకటు రుణ విషయమై ప్రస్తుత ప్రభుత్వం ఏమి తెలియజేయడం లేదని లేదని లబ్దిదారులు వాపోతున్నారు.గత ముఖ్యమంత్రి రిజిస్ట్రేషన్ లో ఫోటో ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదనే ఆవేదన ప్రజల నుండి వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ ఓటియస్ పట్టాలు తనఖా చేసి రుణం తీసుకోవాలంటే బ్యాంకర్లు ముందుకు రావడం లేదని,మా పరిస్థితి ఏమిటోనని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఓటియస్ లబ్దిదారులకు బ్యాంకు లో పట్టాలను తనఖా చేసుకొని రుణం ఇప్పించి వారి కుటుంబ అవసరాలను ప్రభుత్వ పెద్దలు బ్యాంకులతో చర్చించి రుణాలను ఇప్పించి తీరుస్తారని లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు.
What's Your Reaction?






