జియంఆర్ సంస్థ వారు లారీ డ్రైవర్లకు చపాతి,పులిహోర పంపిణీ

చిల్లకల్లు స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 29, 2023 - 10:14
 0  110
జియంఆర్ సంస్థ వారు లారీ డ్రైవర్లకు చపాతి,పులిహోర పంపిణీ

జియంఆర్ సంస్థ వారు లారీ డ్రైవర్లకు చపాతి, పులిహోర పంపిణీ

చిల్లకల్లు

యన్.టి.ఆర్ జిల్లాలో మున్నేరు వాగు వానకి వరద పొంగిపొర్లటంతో కీసర బ్రిడ్జీ పైకి వరద ఉధృతి పెరగడంతో విజయవాడ నుండి హైదరాబాద్ కి వెళ్ళే నేషనల్ హైవే 65 పై వాహనాల రాకపోకలను ప్రభుత్వం నిలుపుదల చేసింది.దీనితో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఆగిపోవడంతో డ్రైవర్లు,క్లీనర్లు పలు ఇబ్బందులకు గురైన్నారు.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/The-wrong-turn-for-the-mother-who-has-changed-generations.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి 

దీని గమనించిన జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద గల జియంఆర్ టోల్ గేట్ సంస్థ తరుపున సిబ్బంది మధ్యాహ్నం రోటి,చపాతి,పులిహోర మరియు త్రాగునీరు ను ఉచితంగా సుమారు 700 మందికి ఆగిన వాహనాల డ్రైవర్లకు,క్లీనర్లకు అందించారు.ఈ కార్యక్రమంలో జియంఆర్ ఓ&యం పి రాజేందర్, ఫైనాన్స్ మేనేజర్ వి ఆదిశేషు,సైట్ ఇంజనీర్ జి మహేష్, నేషనల్ హైవే ఆపరేషన్స్ యం రాఘవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow