మల్కాపురం,ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగింపు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

మల్కాపురం,ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగింపు
గ్రామ పంచాయతీ పెండింగ్ సెస్ టిడి అమ్మౌంట్ ఏప్రియల్ లో విడుదల - డిఆర్ పివివి దుర్గా ప్రసాద్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాని ఆకస్మికంగా యన్.టి.ఆర్ జిల్లా రిజిస్ట్రార్ పివివి దుర్గా ప్రసాద్ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో సుమారు 44 కోట్ల చిల్లర ప్రభుత్వ టార్గెట్ లో 2023 ఏప్రియల్ నుండి 2024 మార్చి నాటికి 10788 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తో సుమారు 39కోట్ల 17 లక్షల ఆదాయంతో 34 శాతంగా ఉంది.ప్రస్తుతం 59 కోట్ల 18 లక్షల టార్గెట్ రావల్సి ఉండగా 2024 ఏప్రియల్ 2025 మార్చి నేటి వరకు 8601 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తో 29కోట్ల 83 లక్షల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు.
దీనితో గత ఏడాది కన్న 1049 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ లు తగ్గటమే కాకుండా -18 శాతం ఆదాయం ఈ కార్యాలయం నుండి తగ్గిందన్నారు.ఇప్పటికే మల్కాపురం,ముచ్ఛింతాల రిజిస్ట్రేషన్ కొనసాగడం లేదన్న మీడియా వారి సమాచారంతో అత్యవసరంగా డిఆర్ గారు ఉన్నతాధికారి అయిన డిఐజి తో ఫోన్ లో మాట్లాడి వెంటనే సమస్యను తిరిగి రిజిస్ట్రేషన్ కొనసాగించాలే పరిష్కరించారు.ఇదేకాకుండా ఎక్కడ లేని సమస్య జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి నవంబర్ 2023 నుండి నేటి వరకు రావాల్సిన సెస్ టిడి అమ్మౌంట్ అందక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయన్న
పాఠశాలకు కంప్యూటర్ల బహుకరణ - https://studiobharat.com/Donation-of-computers-to-school
మీడియా వారి ప్రశ్నలకు ఇది జిల్లా కలెక్టర్ వారి దృష్టిలో కూడా ఉందని,పంచాయతీ పెండింగ్ అమ్మౌంట్ ను త్వరలో ఏప్రియల్ మాసం లో వారికి చెల్లిస్తామన్నారు.జిల్లాలో ఇప్పటికే క్లర్క్ ఆఫీస్ సబార్డినేట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు.ఎటువంటి అభ్యంతరం లేని ఓటియస్ కు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో. బిల్డర్లతో రిజిస్ట్రేషన్ పెంచడానికి అవగాహన మీటింగ్ పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది,బిల్డర్స్ పాల్గొన్నారు.
What's Your Reaction?






