నీటి ఎద్దడిని పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమం చేస్తాం - సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

జగ్గయ్యపేట పట్టణానికి నీటి ఎద్దడి...
వెంటనే పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమం చేస్తాం - సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణానికి గత నుండే వేసవి కాలంలో నీటి సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉందని సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.పూర్వ కాలంలో కావడి పట్టుకొని పాలేరు లో చిన్న చిన్న సెలలు త్వవుకొని నీటిని వాడుకునే వారు.ఎంతమంది నాయకులు వచ్చిన ఎండాకాలం వచ్చే సరికి పాలేరు లో నీరు అందక అష్టకష్టాలు పడుతున్న ప్రజలు తరుపున వామపక్షాలు కృష్ణా వాటర్ ని పట్టణ ప్రజలకు త్రాగునీరుగా అందించాలనే నినాదాని ముందుకు తీసుకొని వచ్చామని ఆయన అన్నారు.
దీనితో జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు కృష్ణా జలాలను సైతం త్రాగునీరుగా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని ఆయన తెలియజేశారు.దీనితో పట్టణ ప్రజలకు నీటి సమస్య తీరుతుందిలే అనుకుంటున్న తరుణంలో పాత పైపులైన్లు పాడవడం,వాటి మరమ్మతులతో మరియు జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికి కరెంటు కోతలతో వాటర్ ట్యాంకులను నింపలేకపోవడంతో ఈ వేసవిలో సైతం నీటి సమస్యతో ప్రజలు కష్టాలు తప్పడం లేదని ఆయన అన్నారు.
ముక్త్యాలలో కృష్ణా నదిలో వాటర్ లెవల్ తగ్గుముఖం పడటంతో కృష్ణానది సైతం పిల్లకాల్వగా మారడంతో కృష్ణా నది పై ఏర్పాటు చేసిన బావులలోకి నీరు అందే పరిస్థితులే ప్రశ్నార్థకంగా మారుతుండటం గమనించదగ విషయం అని ఆయన అన్నారు.దీనితో జగ్గయ్యపేట పట్టణానికి నీటి కష్టాలు తప్పడం లేదని ఆయన అన్నారు.ప్రజలకు త్రాగునీరు నీరుగా అందించే విషయంలో మున్సిపాలిటీ పాలక మండలిలో అధికార ప్రతి పక్షాలు విఫలం అయ్యారని ఆయన విమర్శించారు.
ఇప్పటికైన జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలక మండలి లో అధికార,ప్రతి పక్ష పార్టీల వారు మరియు మున్సిపల్ అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మున్సిపాలిటి పై నీటి ఎద్దడిని ఎదురుకుంటున్న ప్రజలతో ఆందోళన,పోరాటాన్ని చేస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మున్సిపాలిటీ కి హెచ్చరికలు చేశారు.
What's Your Reaction?






