అధికారులు కోడి పందేలను నివారించేనా
స్టూడియో భారత్ ప్రతినిధి

జగ్గయ్యపేట నియోజకవర్గంలో కోడి పందేలు జరగబోతున్నాయా..
అధికారులు కోడి పంథాలను నివారించేనా....
బరులు సిద్ధం కాబోతున్నాయా - గతంలో మాదిరిగానే పోలీసులు చేతులెత్తేసేనా
ప్రతి సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలకు జగ్గయ్యపేట పట్టణం,జగ్గయ్యపేట,వత్సవాయి,పెనుగంచిప్రోలు మండలాలలో జోరుగా సుమారుగా పదుల సంఖ్యలో కోడి పందేల బరులు ఏర్పాట్లు చేయబోతున్నారా అంటే!అవుననే ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.వీటిలో ప్రధానమైనవి జగ్గయ్యపేట పట్టణంలో రెండు చోట్ల,చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో పలుచోట్ల బెట్టింగ్ తో పెద్ద బరుల నుండి చిన్న బారులు సైతం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పందెంలో కోట్ల,లక్షల రూపాయలు నగదు ఆనవాయితీగా చేతులు మారాబోతున్నాయనేదిగా తెలుస్తుంది.
ఎప్పటి మాదిరిగానే పందెంరాయుళ్లదే ప్రతిసారి పైచేయి అవ్వబోతూనే ఉంటుందని పలువురు వాదిస్తున్నారు.ఈసారి ఏమి జరిగిదో వేచి చూడాల్సి ఉంది.ముందస్తుగానే పోలీసు,రెవెన్యూ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని చెప్పుకున్న,ఆఖరి నిమిషాలలో అధికారులు చేతులెత్తేయడం ప్రతిసారి పరిపాటిగా మారుతుందే తప్పా,కోడి పందేలు మాత్రం యద్థావిదిగా నిర్వహించడం జరుగుతూనే ఉంటుందని ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి.
ఎప్పటి నుండో కోర్టులు సైతం ఇటువంటి ఆటలను నిషేధంగా ఆదేశాలు ఉంటున్నప్పటికి వాటిని పంథ్యంరాయులు పెడ చెవిన పెట్టడం పరిపాటేనని ప్రజలు చెప్పుకుంటున్నారు.రెవెన్యూ,పోలీసుల శాఖలు కోడి పంద్యాలను ఆపటానికి మైకులల్లో ప్రచారాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు.కాని పంథ్యంరాయులు మాత్రం కోడి పుంజులకు కత్తులు కట్టి లక్షల నుండి కోట్ల రూపాయల నగదు బెట్టింగ్ లతో పంథ్యాలను నిర్వహిస్తుంటే అధికారులు కళ్ళు అప్పగించి చూస్తుంటారే తప్పా!వాటి పై చర్యలు మాత్రం నామ మాత్రమేనని చెప్పుకోవచ్చు.కోడి పుంజులకు కత్తులు కట్టి కోడి పుంజులను హింసిస్తుండటమే కాకుండా,కోడి పందేల బరులోనే పేకాట,గుండాట,మూడు ముక్కలాట,లోనా బయట,పాచికాలాట లాంటి చట్ట వ్యతిరేక జూదాలాటలు ఆడుతూ కోట్లు,లక్షల రూపాయల నగదు,ఆస్తులు సైతం చేతులు మారే పరిస్థితి లేకపోలేదు.
ప్రతిసారి కోడి పందేల బరులలో విచ్చలవిడిగా పక్క రాష్ట్రాల నుండి ప్రజలు బెట్టింగ్ లో పాల్గొనటానికి ఆశక్తి కనబరుస్తున్నారంటే ఏమేర కోట్ల,లక్షలు రూపాయల నగదు మరియు ఆస్తులు చేతులు మారే పరిస్థితులు ఈసారి కూడా లేకపోదు.ఇటువంటి బెట్టింగ్ లలో పాల్గొన్నడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా రోడ్డు పాలౌతున్నారు.
ఇటువంటి చట్ట వ్యతిరేక జూదాలను ఆడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరుపున జూదాల వ్యసనాల వైపు ప్రజలు ఆకర్షించకుండా ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటలను నిర్వహిస్తుంటే,స్థానిక అధికారులు మాత్రం కోడి పందేల ఆటల వైపు మొగ్గు చూపే పరిస్థితులు లేకపోలేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పటికైన స్థానిక అధికారులు కోడి పందేల నిర్వహణ వల్ల కోడి పుంజులను కత్తులు కట్టి హింసించడం నేరమంగా భావించవచ్చని,నగదు బెట్టింగ్ లు చట్ట వ్యతిరేక చర్యగా భావించవచ్చని,చట్ట వ్యతిరేక జూదాలాటా ఆడటం కూడా నేరమే అవుతుందని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ సందడికి సిద్దమౌతుండగా,పార్టీల వారు మధ్య విబేధాలు, గొడవలు బెట్టింగ్ ల పేరుతో తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదు.
ప్రభుత్వ అధికారులు ఇటువంటి కోడి పందేలు,జూదాలాటలను ప్రోత్సహించకుండా వీటి నివారణ చర్యలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పక్షి ప్రేమికులు మెటికల శ్రీనివాసరావు కోరుతున్నారు.
What's Your Reaction?






