పట్టు వీడని అంగన్వాడీలు,కనికరం చూపించని రాష్ట్ర ప్రభుత్వం....
స్పెషల్ స్టోరీ స్టూడియో భారత్ ప్రతినిధి

పట్టు వీడని అంగన్వాడీలు,కనికరం చూపించని రాష్ట్ర ప్రభుత్వం....
ఏపి వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు వారి సమస్యల పరిష్కారానికి మరియు ఐసిడిఎస్ సంస్థ మనుగడ కోసం 29 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలుగా చర్చలు జరిపి అంగన్వాడీలకు ప్రధాన హామీలలో నమ్మకం కల్పించడంలో వైఫల్యం..
సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పిన అంగన్వాడీలు...
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండానే మహిళలైన వారిపై ఏదో రూపంలో మాట నెగ్గించుకోవాలని ఎస్మా సైతం ప్రయోగించిన అధికారులు...
మా సమస్యలను పరిష్కరించండి మహా ప్రభో అంటున్న అంగన్వాడీలు,
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలా అంటూ అంగన్వాడీలైన మీరు ఎందుకు డ్యూటీలకు గైర్హాజరు అయ్యారంటూ, అంగన్వాడీలపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది...
ఈ రోజు నుండి షోకాజ్ నోటీసులు అందుకుంటున్న అంగన్వాడీలు ది:19/01/2024 లోపు సరైన సమాధానం చెప్పి, డ్యూటీలకు హాజరు కావల్సి ఉంటుంది....
షోకాజ్ నోటీసుకి అంగన్వాడీలు సమాధానం ఇవ్వకపోయినా,డ్యూటీలకు హాజరు కాకపోయిన ఇదే చివరి షోకాజ్ నోటీసు గా భావించి అంగన్వాడీలను టెర్మినేట్ చేయబోతూ ప్రభుత్వ ఆదేశాలు ఉండబోతుందని తెలుస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే ఇంత చిన్న చూపా,ఇంత ఇబ్బందులకు గురి చేయడం సరైందేనా అంటున్న మహిళా లోకం....
పట్టు వీడని అంగన్వాడీలు,కనికరించని రాష్ట్ర ప్రభుత్వం....సేకరణ మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?






