మొండి జగ(న్)మొండి మధ్య అంగన్వాడీల జీవితాలు ఆవిరేనా...

స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 5, 2024 - 18:59
 0  79
మొండి జగ(న్)మొండి మధ్య అంగన్వాడీల జీవితాలు ఆవిరేనా...

మొండి జగ(న్)మొండి మధ్య అంగన్వాడీల జీవితాలు ఆవిరేనా...

ప్రభుత్వం అల్టిమేట్ జారీ తో అంగన్వాడీల జీవితాలు ఆవిరేనా?

అంగన్వాడీలలో బిసిలు,యస్.సిలు, మైనారిటీల మహిళలే ఎక్కువ మంది పనిచేస్తున్నారు.

విశ్లేషణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వారి జీతాలు,సంస్థను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో సమ్మె బాటబడ పట్టిన సంగతి తెలిసిందే.సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలలో ప్రధానమైన జీతం పెంపు విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేసారు.మేమెమి తగ్గేదెలే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 05 జనవరి 2024 లోపు డ్యూటీలకు అంగన్వాడీలు హాజరు కావలసిందేనని ప్రభుత్వం బహిరంగ హుక్కుం జారీ చేసింది.

ఇప్పటికే మహిళలైన అంగన్వాడీలు వారి జీతాలు,సంస్థని కాపాడుకునే దిశగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోడల్ ఆఫీసర్లను నియమించి,అంగన్వాడీ కేంద్రాల తాళ్ళాలను పగ్గలగొట్టడం జరిగింది.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మేధావులు,సానుభూతిపరులు మాత్రం ఇది సభ్య సమాజంలో చీకటి దినంగా చరిత్రలో నిలబడిపోయిందని అభివర్ణిస్తున్నారు.దీనితో ఐదొవ తేది చివరి రోజు అవ్వడంతో డ్యూటీలలోకి అంగన్వాడీలు జాయిన్ కావాలని ఐసిడిఎస్ అధికారులు తెలియజేస్తున్నారు.అటు అంగన్వాడీలు మాత్రం తమ సంస్థను కాపాడుకుందామని,సమస్యల పరిష్కారానికి పట్టుబడుతుంటే,ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్నన మాత్రం నోరు విప్పటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

చోద్యం చూస్తున్న కేంద్రం ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం మాత్రం రోజులు గడుస్తున్న చోద్యం చూస్తున్నారు.అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ససేమిరా అంటున్న అంగన్వాడీలు, అంగన్వాడీలు. పట్టువిడవకుంటే మాత్రం అంగన్వాడీల రిక్ర్యూట్మెంటికి జారీ యత్నం చేయక తప్పదంటున్నట్లుంది అధికార పార్టీ తీరు.మహిళలను అక్కలు,చెల్లెలు అంటుంటే రాష్ట్రంలో మహిళలైన అంగన్వాడీల దుస్థితి పట్ల, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును,మహిళలు అంటే ఇంత చిన్న చూపా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు..... మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow