జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా
స్టూడియో భారత్ ప్రతినిధి

భారతరత్న నెల్సన్ మండేలా జయంతి
కమ్యూనిస్టు మహానేతకు విప్లవ జోహార్లు
జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు నల్లజాతి సూరీడు,
జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మరణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించిన మండేలా 20,వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు.దీంతో ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు వర్ణ సమానతకు ఒక సంకేతం లాగా నిలిచారు.
జీవిత వివరాలను చూస్తే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా దేశ మాజీ అధ్యక్షులు కేఫ్ ప్రాంతంలోని ఉమాటా జిల్లా మవెజో ఊర్లో 1918 జులై 18 తేదీన ఆయన జన్మించారు.
దక్షిణాఫ్రికాకు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా ఈయన కీర్తి గడించారు.అధ్యక్షుడు కాక మునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడీగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు దానికి సాయుధ విభాగం ఆయన ఉంకోంటో విసీజ్యే కు అధ్యక్షుడిగా పనిచేశారు.ఫిబ్రవరి 11, 1990లో జైలు నుండి విడుదల ఆయన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించాడానికి,దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి,అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు.తన పూర్వపు శత్రువు ల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు.
100కు పైగా అవార్డులు సత్కారాలతో వివిధ దేశాలు,సంస్థలు ఈయనను గౌరవించాయి.వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతిముఖ్య మైనది,స్వదేశం లో మండేలాను ' మదిబా ' అని వారి తెగకు సంబంధించిన గౌరవ చూచకంతో పిలుస్తుంటారు.జాతి పిత మహాత్మా గాంధీ బోధించిన శాంతి యుత విధానాలు అహింస,శత్రువును సంస్కార యుతంగా ఎదుర్కొనే పద్దతి తనకు ఎంతో స్పూర్తి నిచ్చాయని మండేలా ఛాలా సార్లు వెల్లడించారు.భారతదేశం కూడా మండేలా ను జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోద్య బహుమతి తో సత్కరించింది.
అలాగే 1990లో భారత ప్రభుత్వము మండేలా ను భారత దేశపు అత్యున్నత పురస్కారం అయన భారత రత్న ను ప్రకటించింది.మన దేశం నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభించిదన్న దానికి నిదర్శనంగా అనేక విగ్రహాలు కూడా చాలా చోట్ల నెలకొల్పబడ్డాయి.కొన్ని కూడళ్ళకు,రోడ్లకు మండేలా పేరు పెట్టారు.ఢీల్లీలో కూడా అయన పేరుతో నెల్సన్ మండేలా రోడ్ ఉంది.అదలా ఉంచితే, 1994లో మండేలా తన 77సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేబట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడయ్యాడు.రెండవ సారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్న ఆయన 1999లో పదవీ విరమణ చేశారు.
జులై 2001లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రేడియేషన్ వైద్యం చేశారు.తన పదవీ విరమణ తరువాత,ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశారు.ఆ తర్వాత జూన్ 2004లో తాను రాజకీయ జీవితం నుండి విరమించుకుని అధికంగా కుటుంబంతో గడపాలని అను కుంటున్నట్లు మండేలా ప్రకటించారు.ఆయితే అయన పూర్తిగా సమాజం నుంచి దూరం కాలేదు,గానీ 2003తరువాత తన సాంఘిక కార్యక్రమాలను బాగా తగ్గించుకున్నారంతే కొంత కాలంగా తీవ్ర శ్వాస కోశ సంబంధ అస్వస్థత తో బాధ పడుతూ 2013డిసెంబర్ 5, న 20: 50గంటలకు జొహెన్స్ బర్గ్ లో మరణించారు.వివిధ దేశాలనుండి సుమారుగా 90, మంది ప్రతినిధులు అయన అంత్య క్రియలకు హాజరు అయ్యారు.
What's Your Reaction?






