ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

ఒడిశా స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 12, 2023 - 01:51
 0  116
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌:

ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది.

దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్‌ డిస్టిల్లరీ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి.

మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్‌చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు.

పట్టణ పద్మశాలి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ....చదవండి.. https://studiobharat.com/Urban-Padmasali-Kartika-Masa-Vana-Samaradhana-Mahotsavam ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...

'ఈ అంశం ధీరజ్‌ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్‌ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు'' అని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ అవినాశ్‌ పాండే ఆదివారం స్పష్టంచేశారు. 

విపక్షాలపై అమిత్‌ విమర్శలు

ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు.'' దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది.విపక్షాలు తమ అవినీతి,అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి.తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్,టీఎంసీ,జేడీయూ,డీఎంకే,ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి''అమిత్‌ వ్యాఖ్యానించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow