త్రాగే జలాలను కలుషిత కోరల నుండి కాపాడండి - మెటికల శ్రీనివాసరావు

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 31, 2024 - 12:45
 0  179
త్రాగే జలాలను కలుషిత కోరల నుండి కాపాడండి - మెటికల శ్రీనివాసరావు

త్రాగే జలాలను కలుషిత కోరల నుండి కాపాడండి - మెటికల శ్రీనివాసరావు

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణం నుండి ముక్యాల రోడ్డకి వెళ్ళే రహదారి మార్గంలో పాలేరు వాగు పై బ్రిడ్జి వద్ద పాలేరు ప్రవాహంలో చుట్టు పక్కల ఫ్యాక్టరీ వారు ట్యాంకుల ద్వారా గాని, పైపుల ద్వారా గాని ప్రమాదకరమైన కెమికల్,ఇతరత్రా రసాయనాలు వాటిలో డంప్ చేయడం వల్ల పారే నీరు కలుషితం అయింది.ఈ పారే నీటిలో చేపలు చనిపోతున్నాయి.మరియు త్రాగటానికి వీలు లేకుండా,నిత్యవసరాలకు వాడుకోని విధంగా మరియు పంట పొలాలు దెబ్బె తింటున్నాయి.

సాగుకి, త్రాగటానికి పాలేరు లో పారే నీరు పనికి రాకుండా పోతున్నాయి.ఇప్పటికే జగ్గయ్యపేట మున్సిపాలిటీ,కెఅగ్రహారం,జయంతిపురం,రావిరాల,ముక్త్యాల ప్రజలకు త్రాగు,సాగు నీరుగా పనికి రాకుండా పోయిన్నాయి.ఇప్పటికే జగ్గయ్యపేట మండలం పలు ప్రాంతాలల్లో భూగర్భ జలాలు కలుషితం అయిన అందరికి తెలిసిన విషయమే.ఇప్పటికే వాయువు కాలుష్యం,భూగర్భ కాలుష్యంతో ప్రమాదపుటంచ్చులో ఉన్న జగ్గయ్యపేట ప్రాంతం అదనంగా జల కాలుష్యంతో ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ఇదే కొనసాగితే జగ్గయ్యపేట ప్రాంత ప్రజలు సైతం ఖాళీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు.సంబందిత అధికారులు వాళ్ళ విధులను సకలంలో స్పందించి చర్యలు చేపట్టిన మరల ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలను చేపట్టి ప్రజలను కాపాడాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు మండల తహశీల్దార్,పొల్యూషన్ శాఖ వార్లకు తెలియజేసారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow