సీజన్ వారీ పనులను మర్చిపోతున్న శానిటేషన్ అధికారులు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

జగ్గయ్యపేట మున్సిపాలిటీ శానిటేషన్ విభాగంలో పనులు ఇష్టానుసారమే
సీజన్ వారీ పనులను మర్చిపోతున్న శానిటేషన్ అధికారులు
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులలో సుమారు 20 వార్డులకు పైబడి మురికి వాడలున్నాయని తెలుస్తుంది.ఈ మురికి వాడలలో ప్రత్యేకంగా సీజన్ వారీగా శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.ప్రతి రోజు ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తే కాకుండా మురుగు కాల్వలో చెత్తను తొలగించి,రోడ్ల వెంబడి తొలగించిన చెత్త ప్రాంతంలో దోమలు ఈగలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ చల్లాల్సి ఉంటుంది.ఇదే కాకుండా సీజన్ వారిగా దోమలు వాటి లార్వా వృద్ధి చెందకుండా మలాథీన్ మరియు దోమలు మందులు మరియు ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది.కాని శానిటేషన్ విభాగంలో శానిటేషన్ విభాగ అధికారి మరియు మున్సిపల్ అధికారులు కుమ్మకు అవ్వడంతో వాటికి ఉపయోగించే వస్తువులు పక్క దారి పడటం జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ఆరోగ్యాల పై శానిటేషన్ ఇన్స్ పెక్టర్ మున్సిపల్ కమిషనర్ కి ఇవేవి పటడం లేదనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను మరియు మున్సిపల్ పాలక వర్గం జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధికి కావాల్సిన వనరులను అందజేస్తున్న కృషి చేస్తున్నప్పటికీ, శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు స్థానికులవ్వడం,వారికి శానిటేషన్ విభాగంలో శానిటేషన్ కి ఉపయోగించే సామగ్రి ని ఎలా పక్క దారి పట్టించాలో తెలుసునని పలువురు తెలియజేస్తున్నారు.శానిటేషన్ పని కంటే నాయకుల మెప్పు ఎలా పొందాలో శానిటేషన్ విభాగ అధికారి కి తెలుసునని పలువురు తెలియజేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ....చదవండి.. https://studiobharat.com/Congress-victory-in-Telangana-assembly-election ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...
ఇదేకాకుండా అని పనులు సచివాలయం నుంచే అని చెప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం.ప్రతి పని జగ్గయ్యపేట మున్సిపాలిటీ శానిటేషన్ విభాగ అధికారిదేనని వాదనలు వినిపిస్తున్నాయి.పనులకు మచర్ల నుండి జనన,మరణ ధృవీకరణ పత్రాల వరకు శానిటేషన్ విభాగ అధికారి పని నుండే కొనసాగాల్సి ఉంటుంది.ఎవరైన సరే అడ్డు మాట్లాడితే వారిని విధుల నుండి ఆపడం లేక వారిని ఎలా తొలగించాలో ఆలోచిస్తూ అట్టి పై చర్యలు చేగొనడంలో సిద్ద హస్తులని తెలుస్తుంది.ఇప్పటికే గతం నుండి జనన,మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో మున్సిపాలిటీలో కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది.అతని తీరు తెలవక స్థానిక ప్రజాప్రతినిధులు తానా అంటే తందానా అనటంతో ప్రజలో శానిటేషన్ పై అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికైన ప్రభుత్వం గమనించి ఇటువంటి ఆగడాలను నివారించే చర్యలు చేపట్టక్క పోతే భవిష్యత్తు లో ప్రజల అభిమానాన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
What's Your Reaction?






