శ్రావణ పూర్ణిమ అనగా జంధ్యాల పౌర్ణమి,రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి
స్టూడియో భారత్ ప్రతినిధి

శ్రావణ పూర్ణిమ అనగా జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి
శ్రావణ పూర్ణిమ చాలా దైవీశక్తులతో కూడిన తిథి.ఈరోజున దేవతారాధన, జపం,స్తోత్ర పారాయణ శీఘ్ర సత్ఫలితాలను ఇస్తాయి.ఈ రోజున ఉపవీతులందరూ ఉపాకర్మ చేసుకొని,నూత్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.ఈ రోజున జప,ధ్యాన,హోమాదులు ఉత్తమ ఫలాలనిస్తాయి.తోబుట్టువులచే రక్షాబంధనాన్ని పొందడం సంప్రదాయంగా వస్తున్నది.భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నం.అందులోనూ అక్కాచెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం అని గుర్తు చేసే పర్వదినం.
ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన.ఆ శక్తి నుంచి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుందనే దృష్టితో ఈ పర్వాన్ని ఏర్పరచారు.సోదరి చేత కట్టబడిన రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది.సకల విద్యాధిదేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవు’నిగా అవతరించి,గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి,వేదాలను ఉద్ధరించాడు.హయగ్రీవుని ఆరాధించిన వారికి విద్యాబుద్ధులు లభిస్తాయి.విద్యార్ధులందరూ ఈరోజున హయగ్రీవుని అర్చించాలి.లౌకిక,పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్రఫలకారి.
What's Your Reaction?






