చిక్కుముడి వీడని వైకాపా,తెదేపా అభ్యర్ధులు ఎవ్వరనేది సందిగ్ధత

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 19, 2024 - 11:15
 0  311
చిక్కుముడి వీడని వైకాపా,తెదేపా అభ్యర్ధులు ఎవ్వరనేది సందిగ్ధత

చిక్కుముడి వీడని వైకాపా,తెదేపా అభ్యర్ధులు ఎవ్వరనేది సందిగ్ధత

అధికార వైకాపా నుండి సామినేని ఉదయభాను,ప్రతిపక్ష తెదేపా నుండి శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఎంఎల్ఏ అభ్యర్ధులుగా అధిష్టానం నుండి సంకేతాలు మాకే అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు...

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట నియోజకవర్గ అధికార వైకాపా నుండి సామినేని ఉదయభాను,ప్రతిపక్ష తెదేపా శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) లు ఎంఎల్ఏ అభ్యర్ధులుగా పోటీ విషయంలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన కొందరు బహిరంగంగానే అధిష్టానం వద్ద మా సామాజిక వర్గానికే టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్న విషయం.ఆ బలమైన సామాజిక వర్గం ఇప్పటికే రాజకీయంగా తెదేపా మాజీ మంత్రి నెట్టెం రఘురాం తరువాత నియోజకవర్గంలో ఎంఎల్ఏ ని సైతం త్యాగం చేసి 25 సంవత్సరాలు ప్రజలకి సేవ చేయడానికి దూరమైనమన్న ఉద్దేశంతో తెదేపా నుండి బొల్లా రామకృష్ణ మరియు వైకాపాలో బొజ్జా సౌమ్య సైతం బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంఎల్ఏ టిక్కెట్ ను అధిష్ఠానాని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో ఎలక్షన్ ఊపు వచ్చి అధికార పార్టీ నుండి సామినేని ఉదయభాను,ప్రతిపక్షం నుండి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గెలుపు కోసం అహర్నిశలు ప్రజా సేవలో స్పీడ్ ను అందుకుంటూ వ్యూహాలు,ప్రతి వ్యూహాలుగా ఎత్తుగడ్డలు వేస్తున్నారు.వీరుతో పాటు వైకాపా లో చేరిన విజయవాడ పార్లమెంటు యంపి కేశినేని నాని (శ్రీనివాసరావు),తెదేపా జిల్లా ఇన్చార్జి మాజీ మంత్రి నెట్టెం రఘురాం లు సైతం ప్రచార బరిలో పాల్గొంటున్నారు.ముక్త్యాల వాసిరెడి రాజా గారు,మాజీ మంత్రి నెట్టెం రఘురాం వరకు ఆ సామాజిక తరగతి నాయకులు మాత్రం ప్రజలకు వారి సేవలను అందించారని,ఈ గత 25 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆ సామాజిక వర్గం ప్రజా సేవలను పూర్తి స్థాయిలో మరచిపోవడంతో ప్రజలు సైతం ఆ సామాజిక వర్గాని మరచిపోయారనే వాదనలు ప్రజల నుండి వినికిడి.

దీనితో ప్రజా క్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాలకు గతంలో ఓటమిపాలైనప్పటికీ ప్రస్తుత శాసనసభ్యులు సామినేని ఉదయభాను మరియు ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్నా మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) లు సైతం రాజకీయలలో గెలుపు ఓటములతో సంభందం లేకుండా ప్రజలను,కార్యకర్తలను అంటి పెట్టుకొన్నారనేది అందరికి తెలిసిన నగ్నసత్యం.ఎలక్షన్ హడావుడి వచ్చినపుడే ఆ సామాజిక తరగతి మేమున్నామని ముందుకు వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్ధులం మేమేనని ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.ఆయా పార్టీల అధిష్టానం మాత్రం ఏ నిర్ణయాని తీసుకుంటుందో యంయల్ఎ అభ్యర్ధులుగా ఎవరిని బరిలో నిలబెడుతుందో వేచి చూడాలి.మెటికల శ్రీనివాసరావు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow