ఓటర్లు ఎంతో మంది నాయకులను యంయల్ఏ గా ఆశ్వీర్వదించారు
ఎవరి గెలుపైన 1.5 నుండి 4 శాతం ఓట్లు పెచ్చు మాత్రమే ..... జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

ఓటర్లు ఎంతో మంది నాయకులను యంయల్ఏ గా ఆశ్వీర్వదించారు
ఎవరి గెలుపైన 1.5 నుండి 4 శాతం ఓట్లు పెచ్చు మాత్రమే
స్టూడియో భారత్ స్పెషల్ స్టోరీ
జగ్గయ్యపేట శాసనసభ ఎన్నికలలో కర్ణలు,యస్.టి లు, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే గెలుపొందడం జరిగింది.కమ్మ సామాజిక వర్గం నుండి ఆరు సార్లు,కాపు నుండి మూడు సార్లు,వైశ్య నుండి మూడు సార్లు యంయల్ఏ లు గా గెలుపొందారు.
అదేవిధంగా పార్టీలుగా చూస్తే సిపిఐ నుండి రెండు పర్యాయాలు,కాంగ్రెస్ నుండి ఐదు సార్లు తెలుగు దేశం నుండి ఆరు సార్లు,వైయస్ఆర్ పార్టీ నుండి ప్రస్తుతం ఒక్కసారి మాత్రమే ప్రజలు యంయల్ఏ పట్టం కట్టారు.
2019 లో జరుగగా సామినేని ఉదయభాను వైఎస్సార్ సీపీ నుండి 87,965 ఓట్లు రాగా,ప్రధాన ప్రత్యర్థి శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) తె.దే.పా 83,187 ఓట్ల మీద 4778 ఓట్ల మెజారిటీతో సామినేని ఉదయభాను గెలుపొందారు.
2014లో జరుగగా శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) తె.దే.పా 80939 ఓట్లు రాగా, ప్రధాన ప్రత్యర్థి సామినేని ఉదయభాను వైఎస్సార్సీపీ 79093 ఓట్ల మీద 1846 మెజారిటీతో శ్రీరాం రాజగోపాల్ గెలుపొందారు.
2009 శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) తె.దే.పా 75107 ఓట్లు రాగా, ప్రత్యర్థి సామినేని ఉదయభాను కాంగ్రెస్ 65429 ఓట్ల మీద 9678 మెజారిటీతో శ్రీరాం రాజగోపాల్ గెలుపొందారు.
2004 సామినేని ఉదయభాను కాంగ్రెస్ 70057 ఓట్ల రాగా, ప్రధాన ప్రత్యర్థి నెట్టెం రఘురామ్ తె.దే.పా 58363 ఓట్ల మీద 11694 మెజారిటీతో సామినేని ఉదయభాను గెలుపొందారు.
1999 సామినేని ఉదయభాను కాంగ్రెస్ 60877 ఓట్లు రాగా, ప్రత్యర్థి నెట్టెం రఘురామ్ తె.దే.పా 53406 ఓట్ల మీద 7471 మెజారిటీతో సామినేని ఉదయభాను గెలుపొందారు.
1994 నెట్టెం రఘురామ్ తె.దే.పా 60893 ఓట్లు రాగా, ప్రత్యర్ధి ముక్కపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ 41838 ఓట్ల మీద 19055 మెజారిటీతో నెట్టెం రఘురాం గెలుపొందారు.
1989 నెట్టెం రఘురామ్ తె.దే.పా 51107 ఓట్లు రాగా,వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్ 49419 ఓట్ల మీద 1688 మెజారిటీతో నెట్టెం రఘురాం గెలుపొందారు.
1985 నెట్టెం రఘురామ్ తె.దే.పా 44613 ఓట్లు రాగా, ముక్కపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ 38384 ఓట్ల మీద 6229 మెజారిటీతో నెట్టెం రఘురాం గెలుపొందారు.
1983 అక్కినేని లోకేశ్వరరావు తెలుగు దేశం 25815 ఓట్లు రాగా,బొద్దులురు రామారావు కాంగ్రెస్ 22306 ఓట్ల మీద 3509 మెజారిటీతో అక్కినేని లోకేశ్వరరావు గెలుపొందారు.
1978 బొద్దులురు రామారావు కాంగ్రెస్ 30209 ఓట్లు రాగా,కొమరగిరి మోహన్ రావు జనతా పార్టీ 22498 ఓట్ల మీద 7711 మెజారిటీతో బొద్దులురు రామారావు గెలుపొందారు.
1972 వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్ ఇండిపెండెంట్ 34746 ఓట్లు రాగా,రేపాల బుచ్చి రామయ్య శ్రేష్టి కాంగ్రెస్ 21485 ఓట్ల మీద 13261 మెజారిటీతో వాసిరెడ్డి రామ్గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్ గెలుపొందారు.
1967 రేపాల బుచ్చి రామయ్య శ్రేష్టి కాంగ్రెస్ 27082 ఓట్లు రాగా,T. R.మూర్తి ఇండిపెండెంట్ 14008 ఓట్ల మీద 13074 మెజారిటీతో రేపాల బుచ్చి రామయ్య శ్రేష్టి గెలుపొందారు.
1962 (ఎస్.టి) గాలేటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ 19536 ఓట్లు రాగా,పొన్నం కోటేశ్వరరావు సిపిఐ 18446 ఓట్ల మీద 1090 మెజారిటీతో గాలేటి వెంకటేశ్వర్లు గెలుపొందారు.
1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభలు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో శాసనసభ సభ్యులుగా గెలుపును ప్రజలు అందించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు మేము బలమని చెప్పుకుంటున్న సామాజిక వర్గాని సైతం పక్కన పెట్టి,తక్కువ సామాజిక వర్గాని,యస్.టి కులాని,ఇండిపెండెంట్ లను సైతం గెలిపించి ఓటర్ల శక్తిని చాట్టారనే చెప్పుకోవచ్చు.ఇప్పటికే ఎవ్వరు గెలిచిన 1.5 నుండి 4 శాతం ఓట్ల మెజారిటీనే సాధించారనేది తెలుస్తోంది.
గతం నుండి చూసుకుంటూ వస్తే ప్రస్తుతం 2024 ఎన్నికలలో ఈ ప్రకారం చూస్తే అధికార వైకాపా పార్టీ నుండి సామినేని ఉదయభాను,ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రధానంగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎన్నికల బరిలో వారి వారి గెలుపు పరీక్షలలో నిలబడబోతున్నారు.వీరి వీరి బల బలాలు చూస్తే జగ్గయ్యపేట నియోజకవర్గ గ్రామాలలో సమ ఉజ్జీలుగా ఉండటం జరుగుతుందని నానుడి.
జగ్గయ్యపేట పట్టణమే గెలుపు ఓటమిలకు ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరికి తెలిసిన విషయమే.1985 సంవత్సరంలో నెట్టెం రఘురాం గెలుపు దిశ సుమారు 6225 కాగా,1999 సంవత్సరంలో సామినేని ఉదయభాను గెలుపు దిశ 7471 కాగా,2009 సంవత్సరంలో 9678 కాగా 2014 లో సుమారు 1849 ఓట్లతో శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గెలుపు దిశగా గెలవగా,2019 సంవత్సరంలో సీనియర్ అయిన సామినేని ఉదయభాను సుమారు 4778 ఓట్ల మెజారిటీతో జగ్గయ్యపేట నియోజకవర్గ చరిత్ర తిరగ వ్రాసాడనే చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం వీరిరువురు గెలుపు కోసం ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు.మరి విజయం ఎవ్వరిని వరిస్తుందో,ఓటర్లు ఎవ్వరికి పట్టం కడతారో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏమి జరగబోతుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.విశ్లేషణ మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు....
What's Your Reaction?






