ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల తీరు ఎటువైపు..
విశ్లేషణ స్టూడియో భారత్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల తీరు ఎటువైపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా,తెదేపా,జనసేన లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.వీరు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పలుదారులు అవలంభిస్తున్నారు.రాష్ట్రంలో ఎలక్షన్ ట్రెండ్ ప్రారంభం అయిందనే చెప్పుకోవచ్చు.అధికార వైకాపాని గద్దె దించేందుకు తెలుగు దేశం పార్టీ తరపున నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా,మరో పక్క వారహి యాత్రతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.వీరి యాత్రలో ప్రజా సమస్యలు వాటి పై వైఫల్యాల కన్న వ్యక్తిగత దూషణలే ప్రచారం కొనసాగుతుంది.దీని వల్ల ప్రజలకు ఆయా పార్టీలు ఏమి చేస్తాయోనని ప్రజలు ఎవరికి ఓటు వేయాలోననే గందరగోళం నెలకొంటుంది.రాష్ట్రాని అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి,వాటి అమలు చేసే ప్రణాళికలు గురించి చెప్పకపోవడం,సినీ ఫిక్కీ లో నాయకుల డైలాకులతో రాష్ట్రాన్ని ఏమి చేస్తారో అర్థం కాని పరిస్థితులలో ప్రజలున్నారు.రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతీయ ప్రధాన పార్టీలు జాతీయ పార్టీ,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ వైపే వీరి నడవడిక.రాష్ట్రంలో మాత్రం ఎవ్వరి దారిన వారుంట్లేనని కనబడుతుంది.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/There-is-a-throbbing-Ganapati-statue... దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి..
ఈ మూడు పార్టీలలో ఉన్న అభిమానులు,కార్యకర్తలు మాత్రం రాష్ట్రాని మా నాయకుడే పాలించాలని క్రింద గొప్పలు చెప్పుకొంటున్నారు.కాని రాష్ట్రంలో ఈ మూడు పార్టీల తీరు మరియు ఆలోచన రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి,రాష్ట్ర స్వయం పాలన కన్న దేశాని పాలిస్తున్న బిజేపి పార్టీ ని భజన చేయడం జరుగుతుందనే ప్రజలలో వినిపిస్తున్న వాదనలు.కాని రాష్ట్రంలో మాత్రం బిజెపి బలపడలేదంటూనే, బిజెపి పార్టీ యొక్క ఆలోచనలను వైకాపా,తెదేపా,జనసేన పార్టీలు అమలు చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు.దీనితో రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలలో ఎవ్వరికైనా ఓటు వేస్తే అది బిజెపి పార్టీ యొక్క విధివిధానాలను అమలు చేసే ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోతున్నాయి.
ప్రాంతీయ పార్టీల వల్ల జరిగిన అభివృద్ధి ఏమిటి
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో బలపడకపోవడంతో,ఈ మూడు ప్రాంతీయ పార్టీల తీరు మాత్రం ఒక్క బిజెపి పార్టీ ని బలపరుస్తున్నట్లే ఉంది.అందుకే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకి ఓటు వేసే దాని కన్న డైరెక్ట్ గా బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు లాంటి జాతీయ పార్టీలకు ఓటు వేస్తే కేంద్రంలో రాష్ట్రం యొక్క పలుకుబడి పెరుగుతుందని మేధావులు భావిస్తున్నారు.ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని పలువురు మేధావి వర్గం అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.
What's Your Reaction?






