మండలంలో తుఫాన్ దెబ్బకు పంట నష్టం

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 6, 2023 - 20:53
 0  56
మండలంలో తుఫాన్ దెబ్బకు పంట నష్టం

మండలంలో తుఫాన్ దెబ్బకు పంట నష్టం

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో మిగ్ జాం తుఫాను దెబ్బకు పంట నష్టం జరిగింది.ఇప్పటికే మండల పరిధిలో చేతికి వచ్చిన వరి పంట సుమారు 1500ఎకరాలు, మొక్క జొన్న సుమారు 300 ఎకరాలు,మిర్చి, కూరగాయలు,ఆకు కూరలు తోటలు మరియు కాకరకాయ పందిలు,దొండ పందిరిలు నష్టపోయినట్లు సమాచారం.

ఇప్పటికే పలు చోట్ల చేతికొచ్చిన వరి పంట పూర్తిగా వర్షపు నీటిలో మునిగి కంకులు దేనికి పనికి రాకుండా పోయిందని,మొక్క జొన్న చెట్లు గాలికి విరిగి పడ్డాయని,కాకర పందిరిలు పూర్తిగా పడిపోయాని,మిర్చి పూత,పింద,కాయలు పాడైనాయని మండలంలో ఇతరత్రా పంటలు తుఫాను దెబ్బకు దెబ్బ తిన్నాయని రైతులు,కౌలు రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సుమారు 30వేల నుండి 3లక్షల రూపాయల మేర పంట దిగుబడుల కోసం రైతులు,కౌలు రైతులు ఖర్చు చేశారని వారన్నారు.సంబందిత అధికారులు పంట నష్టాని త్వరితగతిన అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని వారు కోరుతున్నారు.తుఫాను దెబ్బకు దెబ్బ తిన వడ్లను మరియు తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,మిగిలిన పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు,కౌలు రైతులు కోరుతున్నారు.

శ్రీ బహుచర్ మాత మందిర్ ....చదవండి.. https://studiobharat.com/Shri-Bahuchar-Mata-Mandir ....దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow