పాత్రికేయులకు షరతులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

పాత్రికేయులకు షరతులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి - జూనెబోయిన శ్రీనివాసరావు
జగ్గయ్యపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని జివో:395 ని షరతులతో విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే షరతులను విదించడం దారుణమని సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు పాత్రికేయుల సమావేశంలో అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు,ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ లను ఇవ్వాలని పలు రకాలుగా వివిధ రూపాలలో ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ఒక్క ప్రకటన ద్వారా తెలియజేసారు.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయుల కలలో సంతోషాలని వ్యక్త పరిచారు.రాష్ట్ర ప్రభుత్వం జివో నెం 395 విడుదల చేయడంతో పాత్రికేయుల సంతోషం కాస్త ఆవిరై నిరాశ్రను మిగిలిచిందని చెప్పుకోవచ్చని ఆయన తెలియజేశారు.
దయచేసి మా ఛానల్ ని కూడా చూసి లైక్ చేసి సబ్ స్రైబ్ చేసుకోండి... https://youtu.be/EmsKgs9I08E?si=wa1_3QOJb4El92FN
పాత్రికేయులకు అక్రిడేషన్ ఎటువంటి కాలపరిమితి లేకుండా,సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను ఆధారంగాను మరియు ఎటువంటి షరతులు లేకుండా పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న వారందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు పత్రికా ముఖంగా ప్రభుత్వాని డిమాండ్ చేశారు.
What's Your Reaction?






